![]() |
![]() |

అనసూయ అంటే చాలు సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్. మంచిగా కామెంట్స్ పోస్ట్ చేస్తే పద్దతిగా రిప్లై ఇస్తుంది. అంతకు మించి ప్రవర్తిస్తే అలాగే ఘాటుగా వ్యవహరిస్తోంది. అనసూయ డోంట్ కేర్ అనే టైపు...హార్ట్ వరకు ఏ విషయాన్ని కూడా తీసుకోదు. అలాంటి అనసూయ తన లేటెస్ట్ అప్ డేట్స్ ని అన్నిటినీ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భంగా క్యూట్, లేటెస్ట్ పిక్స్ ని, తన ఫామిలీతో కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. అలాగే ట్విట్టర్ లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పండగ శుభాకాంక్షలు అంటూ ఒక మెసేజ్ ని షేర్ చేసింది . అలాగే అనసూయ ఇంటి ముందు అందమైన రంగవల్లి వేసి ఇంకా అందమైన ఇంద్రధనుస్సు రంగుల చీరతో కన్ను కొడుతూ మరీ ఫోటో దిగేసరికి ఫాన్స్ అందరూ ఫిదా ఇపోయారు. ఈ పిక్స్ ని చూసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. "అందంగా ఉండే వాళ్లకు టాక్స్ కట్టాలని పెడితే మీరే ఎక్కువ కట్టాల్సి వస్తుంది..ఇంత అందాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు...ఒక అమ్మాయిగా నేను చాలా షాకవుతున్నా మీ బాడీని ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మీ శారీ చాలా బాగుంది.." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ యాంకరింగ్ ఆపేసి, వరుసగా మూవీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తోంది.. రీసెంట్ గా ఆమె విమానం అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే.. సముద్రఖని ప్రధాన పాత్రలో కనిపించరు. ఈ సినిమాలో అనసూయాది చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ రోల్స్ లో అదరగొడుతోంది. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. ప్రస్తుతం యాంకరింగ్కు గుడ్’బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్లో నటించనున్నారని తెలుస్తోంది. మధురవాణి క్యారెక్టర్లో అనసూయ కనిపించనుంది అనే టాక్ ఎప్పుడో వచ్చేసింది. ఐతే దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు.
![]() |
![]() |